చిత్తూరు, ఏ.పీ, 25 మే (హి.స.)రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పం లో నూతనంగా ఇంటి నిర్మాణం పూర్తి చేసుకొని గృహ ప్రవేశం కార్యక్రమం అత్యంత వైభవం గా నిర్వహించడం జరిగింది. ఉదయం 5గంటల నుండి 6గంటల లోపల వేదపండితుల మంత్రోచ్ఛరణ మధ్య సొంత ఇంటికి లోకి చంద్రబాబు కుటుంబ సభ్యులు దేవుడి చిత్ర పటాలను తీసుకోని గృహప్రవేశం చేశారు.సీఎం చంద్రబాబు నాయుడు ఆయన సతీమణి నారా భువనేశ్వరి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఆయన సతీమణి నారా బ్రాహ్మణి పాల్గొని గృహప్రవేశం కార్యక్రమం లో నిర్వహించడం జరిగింది.నూతన గృహం వద్ద టిడిపి శ్రేణుల కొలహాలం సీఎం చంద్రబాబు కుప్పం లో నూతనంగా నిర్మించిన నూతన గృహప్రవేశం సందర్బంగా పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. వారి కోసం విందు భోజనాలు ఏర్పాటు కోసం భారీగా షెడ్ లు సుమారు ఇరవై వేల మంది భోజనాలు చేసే విధంగా సదుపాయాలు కల్పించారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..