హైదరాబాద్, 25 మే (హి.స.)
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన ఎమ్మెల్సీ కవిత లేఖ వ్యవహారంపై బిజెపి ఎంపీ లక్ష్మణ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. KCR, వైఎస్ కుటుంబాలల్లో తలెత్తిన పలు అంశాలను లేవనెత్తారు. ఇందులో భాగంగా.. ఆస్తులు, పదవుల పంపకాల్లో తేడాలు వచ్చాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు రాజకీయాల్లోకి అన్నలు వదిలిన బాణాలు.. ఆస్తులు, పదవుల పంపకాల్లో తేడాలు రావడంతో.. ఇప్పుడు అన్నలపైనే గురిపెట్టారని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు.
పదేళ్లుగా సామాజిక న్యాయం గురించి కవిత మాట్లాడలేదు. కానీ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందనే భయంతో కవితతో కాంగ్రెస్ పార్టీ ఇటువంటి పావులు కదుపుతోందని లక్ష్మణ్ ఆరోపించారు. అస్తిత్వం కోసమే కవిత పోరాటం చేస్తుందని, లిక్కర్ కేసుల్లో ఉన్న వారిని ప్రజలు స్వాగతించరని గత ఎన్నికల్లో కవితకు సానుభూతి కూడా రాలేదని ఎద్దేవా చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..