చిత్తూరు, 25 మే (హి.స.)కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం శివపురం వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబం నూతన గృహప్రవేశం చేసింది. కొత్త ఇంట్లో నారా బ్రాహ్మణి పాలు పొంగించారు. ఈ సందర్భంగా, కుప్పం గృహ ప్రవేశానికి నియోజకవర్గ నలుమూలల నుంచి ప్రజలు వచ్చి తమ సొంతింటి పండుగలా పాల్గొనడం చాలా సంతోషాన్నిచ్చిందని బ్రాహ్మణి పేర్కొన్నారు.ఇంత మంది ఆత్మీయుల ఆశీర్వాదం అందుకోవడం నిజంగా అదృష్టం అని, వారి అభిమానానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..