చిత్తూరు ,25 మే (హి.స.):కుప్పం ()లో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ) సొంత ఇంటి గృహప్రవేశం పండుగలా ) జరిగింది. ఎప్పటి నుంచో అనుకుంటున్న సొంతింటి కల ఈ రోజు నెరవేరింది. ఆదివారం తెల్లవారుజాము 4:30 గంటలకే గృహప్రవేశ పూజ కార్యక్రమాలు జరిగాయి. చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు సాంప్రదాయ పద్ధతిలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలు ముగించుకున్న అనంతరం ఉదయం 10 గంటలకు టీడీపీ కుటుంబ సభ్యులు, ప్రజలను చంద్రబాబు దంపతులు కలవనున్నారు. ఈ గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని చంద్రబాబు కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలపనున్న వారి కోసం ప్రత్యేక వేదికను సిద్ధం చేశారు. ఈ శుభ కార్యక్రమానికి వచ్చే వారందరికీ పసందైన పలు రకాల విందు వంటకాలు కూడా సిద్ధం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ