మేడిపల్లిలో విషాదం.. కారు ఢీ కొని బాలుడు మృతి
హైదరాబాద్, 25 మే (హి.స.) ఓ వ్యక్తి అజాగ్రత్త డ్రైవింగ్తో బాలుడి మృతికి కారణమైంది. ఈ సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. పర్వతాపూర్ భూలక్ష్మి నగర్ కాలనీకి చెందిన చౌహన్ రాజకుమార్ కుమారుడు విజయరాజ్ (18 నెలలు) శనివారం ర
కారు ప్రమాదం


హైదరాబాద్, 25 మే (హి.స.)

ఓ వ్యక్తి అజాగ్రత్త డ్రైవింగ్తో

బాలుడి మృతికి కారణమైంది. ఈ సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. పర్వతాపూర్ భూలక్ష్మి నగర్ కాలనీకి చెందిన చౌహన్ రాజకుమార్ కుమారుడు విజయరాజ్ (18 నెలలు) శనివారం రాత్రి ఇంటి బయట ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో పక్కనే నివాసం ఉంటున్న శ్రీనాథ్ అనే వ్యక్తి తన కారును నిర్లక్ష్యంగా నడుపుతూ విజయ్ రాజ్ను ఢీ కొట్టాడు.

ఈ ప్రమాదంలో బాలుడి తలపై నుంచి కారు వెళ్లడం వల్ల తీవ్ర గాయాలు కావడంతో వెంటనే చికిత్స కోసం స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. వైద్యులు పరీక్షించి బాలుడు అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande