అమరావతి, 25 మే (హి.స.)
పల్నాడు: పల్నాడు జిల్లా గుండ్లపాడు జంట హత్యల ఘటనలో పిన్నెల్లి సోదరులపై కేసు నమోదైంది. 302 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎ-1గా జవిశెట్టి శ్రీను, ఎ-2గా తోట వెంకట్రావు, ఎ-3గా తోట గురవయ్య, ఎ-4గా నాగరాజు, ఎ-5గా తోట వెంకటేశ్వర్లు, ఎ-6గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎ-7గా పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిని చేర్చారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రశాంతంగా ఉన్న పల్నాడులో.. శనివారం సాయంత్రం తెదేపా నేతలను అదే పార్టీకి చెందిన మరికొంత మంది హత్య చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ హత్యల వెనుక మాచర్ల వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరుల హస్తం ఉన్నట్లు స్థానిక ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి, స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు తాజాగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మొత్తం ఏడుగురిపై కేసు నమోదు చేయగా.. నలుగురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ