ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పరువును, భారతదేశ ప్రతిష్టను మంటగలిపిన కాంగ్రెస్ సర్కార్.. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
హైదరాబాద్, 25 మే (హి.స.) రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పరువును, భారతదేశ ప్రతిష్టను మంటగలిపిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. హైదరాబాదులో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలపై.. మిస్ ఇంగ్లండ్ మి
సబితా ఇంద్రారెడ్డి


హైదరాబాద్, 25 మే (హి.స.)

రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పరువును, భారతదేశ ప్రతిష్టను మంటగలిపిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. హైదరాబాదులో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలపై.. మిస్ ఇంగ్లండ్ మిల్లా మ్యాగీ సంచలన వ్యాఖ్యలు చేశారని తెలిపారు. మధ్య వయసు ఉన్న పురుషులను ఆనందపెట్టాలని తమపై ఒత్తిడి తీసుకువచ్చారని, తమను వేశ్య లాగా చూశారంటూ ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ పోటీల నుంచి మధ్యలోనే తప్పుకుని స్వదేశానికి వెళ్లిపోయారని చెప్పారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన మిస్ వరల్డ్ పోటీల్లో ఇలాంటి ఘటనలు జరగడం.. అది కూడా మన రాష్ట్రంలో జరిగినప్పుడే తెరపైకి రావడం ప్రభుత్వ తీరుపై, నిర్వాహకుల తీరుపై అనేక అనుమానాలను కలిగిస్తున్నదని చెప్పారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande