అమరావతి, 25 మే (హి.స.): నకిలీ ఇళ్ల పట్టాల కేసులో విచారణ ఎదుర్కొంటున్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అస్వస్థతకు లోనయ్యారు. కస్టడీలో భాగంగా పోలీసులు వంశీని కంకిపాడు పోలీ్సస్టేషన్కు తరలించారు. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో వాంతు లు చేసుకోవడంతో పీహెచ్సీకి తరలించారు. శనివారం ఉదయం వరకు వైద్యం అందజేశారు. తర్వాత స్టేషన్కు తరలించారు. పోలీసులు విచారణకు సిద్ధమవుతుండగా, మళ్లీ వాంతులయ్యే సూచనలు ఉన్నాయని వంశీ చెప్పారు. దీంతో ఆయన్ను పోలీసులు విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి, నీరసంగా ఉండడం వల్ల వాంతులు అయినట్టు తెలిపారు. దీంతో పోలీసులు రెండో రోజు వంశీని విచారించకుండానే కోర్టులో హాజరుపరిచారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ