హైదరాబాద్, 25 మే (హి.స.)
ఏపీ ప్రభుత్వం ఏ ఒక్క అనుమతి లేకుండా కేంద్రం జుట్టు చేతిలో ఉందని రాత్రికి రాత్రి పనులు చేసే ప్రయత్నం చేస్తున్నారని BRS నేత హరీశ్ రావు ఫైర్ అయ్యారు. 'బనకచర్ల కొత్త ప్రాజెక్టు కాదా? విభజన చట్టం ప్రకారం KRMB/ GRMB అనుమతి తీసుకోవాలి. TG పాత ప్రాజెక్టులు పూర్తి చేస్తామంటే AP అడ్డుకుంది. నీతి అయోగ్ను బహిష్కరిస్తామన్న రేవంత్.. నిన్న మీటింగ్కు హాజరయ్యాడు. సమావేశంలో బనకచర్లను అడ్డుకుంటారనుకుంటే అలా చేయలేదు' అని మండిపడ్డారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..