అమరావతి, 25 మే (హి.స.)
తూర్పుమధ్య అరేబియా సముద్రంలో దక్షిణ కొంకణ్ తీరానికి సమీపంలోని వాయుగుండం గడిచిన 6 గంటల్లో 5 కి.మీ వేగంతో తూర్పు వైపుకు నెమ్మదిగా కదులుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది రత్నగిరి సమీపంలో దక్షిణ కొంకణ్ తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు వివరించింది. మంగళవారం(27-05-25) నాటికి పశ్చిమమధ్య బంగాళాఖాతం ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న నేపధ్యంలో రాష్ట్రంలో రానున్న మూడు రోజులు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు అధికారులు. తీరం వెంబడి గంటకు 40-50కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు. హోర్డింగ్స్, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు దగ్గర నిలబడరాదన్నారు. పిడుగులతో కూడిన వర్షాలు నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇప్పటినుంచే ఉద్యానవన రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి