అమరావతి, 25 మే (హి.స.)
హైదరాబాద్: అగ్ర కథానాయకుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ అభిమానులకు శుభవార్త. సుజీత్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ఓజీ’. ఈ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఎదురు చూస్తున్న వారి కోసం చిత్ర బృందం క్రేజీ అప్డేట్ను ఇచ్చింది. ఈ చిత్రాన్ని దసరా కానుకగా సెప్టెంబరు 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ‘ఫైరింగ్ వరల్డ్ 25 సెప్టెంబరు 25’ అని పేర్కొంది. ఈ ప్రకటనతో పవన్ అభిమానులు తెగ సంబర పడిపోతున్నారు.
పవన్కల్యాణ్ ఇప్పటికే ఒప్పుకొన్న సినిమాలను ఒక్కొక్కటిగా పూర్తి చేసే పనిలో ఉన్నారు. తాజాగా ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ పూర్తి చేసి, ‘ఓజీ’ కోసం రంగంలోకి దిగారు. ఇటీవల షూటింగ్ మళ్లీ మొదలు పెట్టినట్లు చిత్ర బృందం కూడా ప్రకటించింది. వీలైనంత త్వరగా ఈ మూవీని పూర్తి చేయాలని నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్ భావిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ మూవీ అంచనాలను పెంచింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ