హైదరాబాద్, 25 మే (హి.స.)
సీనియర్ జర్నలిస్టు, తెలంగాణ జర్నలిస్టుల సంఘం నేత ఎండీ మునీర్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. సింగరేణి కార్మికుల నడుమ జీవిస్తూ, వారి సమస్యలను వెలుగులోకి తెస్తూ, నిబద్ధత కలిగిన పాత్రికేయుడిగా సుదీర్ఘ కాలం పనిచేసిన మునీర్ కృషి గొప్పదన్నారు. టీజేఎఫ్ నేతగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన పోరాటంలో సింగరేణి ప్రాంత ప్రజా సంఘాలను, ఉద్యమ శక్తులను సమన్వయం చేయడంలో, వారిని చైతన్యపరచడంలో జర్నలిస్టుగా ఆయన సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. మునీర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్