ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను కలిసిన కేటీఆర్..
హైదరాబాద్, 25 మే (హి.స.) బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కుమారుడు కేటీఆర్ ఆదివారం మధ్యాహ్నం ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కలిశారు. ఈ కలయికలో వీరిద్దరి మధ్య పార్టీకి సంబంధించిన పలు కీలక అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచార
కెసిఆర్ కేటీఆర్


హైదరాబాద్, 25 మే (హి.స.)

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కుమారుడు కేటీఆర్ ఆదివారం మధ్యాహ్నం ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కలిశారు. ఈ కలయికలో వీరిద్దరి మధ్య పార్టీకి సంబంధించిన పలు కీలక అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా కవిత రాసిన లేఖ, దానివల్ల ఏర్పడిన పరిస్థితులు ఈ భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చాయని తెలుస్తోంది. పార్టీలోని తదుపరి చర్యలు, మార్గదర్శకాలు కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande