తిరుమల, 25 మే (హి.స.): ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, గాయని స్మిత, టీమ్ ఇండియా ఫీల్డింగ్ మాజీ కోచ్ దిలీప్ తిరుమల శ్రీవారిని వేర్వేరుగా దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. తొలుత తితిదే అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన వారు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి