అమరావతి, 25 మే (హి.స.)
కడప: ఈనెల 27, 28, 29 తేదీల్లో కడపలో జరిగే తెలుగుదేశం పార్టీ మహానాడును ఘనంగా నిర్వహించాలని మంత్రులు స్పష్టం చేశారు. ఈమేరకు కడప ఆర్అండ్బీ అతిథి గృహంలో మంత్రులు అచ్చెన్నాయుడు, నారాయణ, నిమ్మల రామానాయుడు, కొల్లు రవీంద్ర, గొట్టిపాటి రవికుమార్, రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో మహానాడు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. మహానాడుకు రాష్ట్ర నలుమూలల నుంచి భారీ సంఖ్యలో అభిమానులు, ప్రజలు హాజరవుతున్న దృష్ట్యా వారికి రవాణా సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు రాకుండా 3 రోజులు పాటు జరిగే మహానాడుకు కావలసిన రవాణా సౌకర్యాన్ని పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు. చివరి రోజు బహిరంగ సభకు 5 లక్షల మంది రానున్న దృష్ట్యా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రులు నిర్ణయించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ