సికింద్రాబాద్ రైల్వే.స్టేషన్ లో కొత్తగా ఏర్పాటు చేసిన 2 ఏ గేట్ వినియోగం లోకి
అమరావతి, 25 మే (హి.స.) రెజిమెంటల్‌బజార్, సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో కొత్త ఏర్పాటు చేసిన 2ఏ గేట్‌తో పాటు జనరల్‌ టికెట్ల కౌంటర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ స్టేషన్‌ నుంచి నిత్యం 2 లక్షల మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. కేంద్రం
సికింద్రాబాద్ రైల్వే.స్టేషన్ లో కొత్తగా ఏర్పాటు చేసిన 2 ఏ గేట్ వినియోగం లోకి


అమరావతి, 25 మే (హి.స.)

రెజిమెంటల్‌బజార్, సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో కొత్త ఏర్పాటు చేసిన 2ఏ గేట్‌తో పాటు జనరల్‌ టికెట్ల కౌంటర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ స్టేషన్‌ నుంచి నిత్యం 2 లక్షల మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. కేంద్రం రూ.720 కోట్లతో స్టేషన్‌ ఆధునికీకరణ చేపడుతోంది. ప్రస్తుతం పాత భవనంలోని ప్రధాన ముఖద్వారం వైపు 3, 3ఏ గేట్లు, 5వ నంబరు, రేతిఫైల్‌ బస్‌స్టేషన్‌ వద్ద 1వ నంబరు, గణపతి ఆలయం సమీపంలో పార్కింగ్‌ కోసం నిర్మించిన భవనంలో 2వ నంబరు గేటు నుంచి, 10వ నంబరు ప్లాట్‌ఫాం వైపు రాకపోకలు సాగుతున్నాయి. ప్రధాన ప్రవేశద్వారం వైపు మిగిలిన కూల్చివేత పనులు చేపడితే అక్కడున్న 3, 3ఎ గేట్లనూ మూసివేయాలి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రవేశ ద్వారం సమీపంలో నిర్మించిన భవనంలో 2ఏ గేటును ఏర్పాటు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande