నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మితే చట్టపరమైన చర్యలు. రంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నర్సింహారావు
తెలంగాణ, రంగారెడ్డి జిల్లా. 25 మే (హి.స.) నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మితే చట్టపరమైన చర్యలు తప్పవని డీలర్లను రంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నర్సింహారావు హెచ్చరించారు. చేవెళ్లలోని రైతు వేదికలో నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మకూడదని డీలర్లకు అవగా
వ్యవసాయ శాఖ


తెలంగాణ, రంగారెడ్డి జిల్లా. 25 మే (హి.స.)

నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మితే చట్టపరమైన చర్యలు తప్పవని డీలర్లను రంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నర్సింహారావు హెచ్చరించారు. చేవెళ్లలోని రైతు వేదికలో నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మకూడదని డీలర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయించే డీలర్లు ఇది కేవలం వ్యాపారంగానే కాకుండా ఒక సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. డీలర్లు ప్రభుత్వ నియమ నిబంధనలను అనుసరించి వ్యవసాయ శాఖ చట్టాల ప్రకారం రైతులకు సేవలు అందించాలని తెలిపారు. వ్యాపార ప్రయోజనాల కోసం అడ్డదారులు తొక్కితే పిడి యాక్టు కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande