తెలంగాణ, ములుగు. 25 మే (హి.స.)
పశువులను అక్రమంగా
కబేళాలకు తరలిస్తున్న డీసీఏం వాహనం బోల్తా పడడంతో 8 పశువులు మృతి చెందిన ఘటన ములుగు జిల్లా నూగూరు వెంకటాపూర్ మండలం రాచపల్లి గ్రామ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు చర్ల నుండి హైదరాబాద్ లోని కబేళాలకు పశువులను అక్రమంగా డీసీఏం వాహనంలో తరలిస్తుండగా ప్రమాదవ శాత్తు వెంకటాపురం మండల రాచపల్లి గ్రామ సమీపంలో వ్యాన్ బోల్తా పడిందని తెలిపారు. ఈ ప్రమాదంలో 8 పశువులు మృతి చెందగా డీసీఏం డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయాడని స్థానికులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలిసులు ఘటనా స్థలానికి చేరుకోని కేసు నమోదు చేసి దర్యాప్తు కోనసాగిస్తున్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు