శంషాబాద్:, 25 మే (హి.స.) రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసు పెట్రోలింగ్ వాహనాన్ని లారీ ఢీకొంది. ఈ ఘటనలో విజయ్ కుమార్ అనే కానిస్టేబుల్ మృతి చెందారు. మరో ముగ్గురు కానిస్టేబుళ్లకు గాయాలు కాగా.. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
లారీ డ్రైవర్ మితిమీరిన వేగం కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతి చెందిన కానిస్టేబుల్ విజయ్ కుమార్ శంషాబాద్ పోలీసు స్టేషన్లో పని చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ