తిరుమల, 25 మే (హి.స.)
టీటీడీలో మరింత పారదర్శకంగా సాంకేతిక సేవలు అమలు చేయనున్నట్లు ఈఓ జె.శ్యామలరావు వెల్లడించారు. శనివారం అన్నమయ్య భవనంలో టీటీడీ డయల్ యువర్ ఈఓ ప్రోగ్రామ్ జరిగింది. ఈ కార్యక్రమంలో అదనపు ఈఓ వెంకయ్య చౌదరితో కలిసి ఈఓ పలు అభివృద్ధి ప్రణాళికలను వివరించారు. ఎన్నారైలూ శ్రీవారి సేవ చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. గోమాత సేవ చేసేందుకు కొత్తగా గో సేవ ను అందుబాటులోకి తీసుకురానున్నామని తెలిపారు.
తిరుమలను పక్కా ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడానికి టీటీడీ అర్బన్ టౌన్ ప్లానింగ్ విభాగం ఏర్పాటు చేశాం. ఫస్ట్ ఫేజ్లో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుమలలోని ఆకాశగంగ, పాపవినాశనం, అమరావతిలోని వేంకటేశ్వరస్వామి ఆలయం, ఒంటిమిట్ట కోదండ రామాలయం అభివృద్ధికి మాస్టర్ప్లాన్ తయారు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు ఈఓ వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి