తెలంగాణ,కాళేశ్వరం, 25 మే (హి.స.)
కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాలకు భక్తుల రద్దీ
కొనసాగుతున్నది. సోమవారం అనగా నేటితో పుష్కరాలు ముగియనున్నాయి. దీంతో త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పుష్కర స్నానం ఆచరించి, దైవదర్శనం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కాళేశ్వరం నుంచి సిరోంచ బ్రిడ్జి వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సుమారు 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రద్దీని దృష్టిలో పెట్టుకొని అధికారులు వన్ వే ఏర్పాటు చేసినా ట్రాఫిక్ జామ్ కొనసాగుతుంది.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు