ప్రశాంతంగా ముగిసిన గ్రామ పాలనాధికారి పరీక్ష..
తెలంగాణ, వికారాబాద్. 25 మే (హి.స.) గ్రామా పాలన అధికారి పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. ఆదివారం వికారాబాద్ పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో గ్రామ పాలన అధికారి పరీక్షను నిర్వహించారు.
వికారాబాద్ కలెక్టర్


తెలంగాణ, వికారాబాద్. 25 మే (హి.స.)

గ్రామా పాలన అధికారి పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. ఆదివారం వికారాబాద్ పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో గ్రామ పాలన అధికారి పరీక్షను నిర్వహించారు. పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్, అధికారులు పరిశీలించారు. ఈ పరీక్షకు 150 మంది అభ్యర్థులకు గాను 143 మంది అభ్యర్థులు హాజరు అయ్యారని కలెక్టర్ తెలిపారు.

ముందుగా జిల్లా కలెక్టర్ ప్రశ్నపత్రాలను సంబంధిత అధికారుల సమక్షంలో సీల్ ఓపెన్ చేశారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande