తెలంగాణ, జయశంకర్ భూపాలపల్లి. 25 మే (హి.స.) జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి నది పుష్కరాలలో నేడు
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు పాల్గొన్నారు. హెలికాప్టర్లో కుటుంబ సమేతంగా ఆదివారం కాళేశ్వరం చేరుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులకు రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు స్వాగతం పలికారు. పుష్కరాలలో భాగంగా త్రివేణి సంగంమం వద్ద గవర్నర్ దంపతులు పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం ముక్తేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు