సినీ రంగానికి సహకరించేందుకు సిద్ధం.. ఏపీ మంత్రి కందుల దుర్గేశ్ కీలక వ్యాఖ్యలు
ఏ.పీ, అమరావతి. 26 మే (హి.స.) పవన్ కల్యాణ్ సినిమా విడుదల ముందు ఎవరైనా థియేటర్లు బంద్ చేసే నిర్ణయం తీసుకోవడం దుస్సాహాసమే అవుతుందని నిర్మాత అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు విదితమే.ఈ అంశంపై ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ స్పందించారు. సినిమా థియ
మంత్రి కందుల దుర్గేశ్


ఏ.పీ, అమరావతి. 26 మే (హి.స.)

పవన్ కల్యాణ్ సినిమా విడుదల

ముందు ఎవరైనా థియేటర్లు బంద్ చేసే నిర్ణయం తీసుకోవడం దుస్సాహాసమే అవుతుందని నిర్మాత అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు విదితమే.ఈ అంశంపై ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ స్పందించారు. సినిమా థియేటర్ల అంశంపై అల్లు అరవింద్ మాట్లాడింది అవాస్తవమని అన్నారు. సినీ రంగ అభివృద్ధి కోసం చంద్రబాబు ఎంతో చేశారని గుర్తు చేశారు. పవన్ సినిమాను అడ్డుకునే వారిలో 'ఆ నలుగురు' ఉన్నరంటూ వచ్చిన వార్తలకు తనకు సంబంధం లేదన్నారు. ఆ నలుగురిలో తాను లేనని.. వారితో అన్ని సంబంధాలు ఏనాడు తెంచుకున్నానని అన్నారు. తెలంగాణలో తనకు ఒక్క థియేటర్ కూడా లేదని.. ఆంధ్రాలో కూడా కేవలం 15 లోపే ఉన్నాయని అన్నారు. 'ఆ నలుగురు' అని వేసేటప్పుడు తన పేరు వాడొద్దని సూచించారు. సినీ పరిశ్రమలో సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని కలవాలని చెప్పినా ఎవరూ పట్టించుకోలేదని అన్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande