తెలంగాణ, జనగామ. 26 మే (హి.స.)
మే 26: ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఎర్ర జెండా ఎప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉంటుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. బచ్చన్నపేట మండలం గోపాల్ నగర్లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, జనగామ నియోజకవర్గ మొదటి శాసనసభ్యులు కామ్రేడ్ గోపాల్ రెడ్డి స్మారక స్తూపాన్ని జాన్ వెస్లీ సోమవారం ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. నాడు సాగిన తెలంగాణ రైతంగ సాయుధ పోరాటంలో గోపాల్ రెడ్డి కీలక భూమిక పోషించారన్నారు. ఎర్రజెండా నాయకత్వంలో భూస్వాముల చెర నుంచి పది లక్షల ఎకరాల భూమిని విడిపించారని చెప్పారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు