హైదరాబాద్, 26 మే (హి.స.)
దేశ వ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య వెయ్యి దాటిపోయింది.. మరీ ముఖ్యంగా కరోనా కేసులు . ఢిల్లీని వణికిస్తున్నాయి. ఢిల్లీలో వైరస్ బాధితులు వంద కేసులు బయటపడ్డాయని.. వీళ్లందరినీ ఇంట్లోనే క్వారంటైన్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
కేరళ టాప్.. దేశం వ్యాప్తంగా డేటా పరిశీలిస్తే.. కేరళలో 430 కేసులతో టాప్ ప్లేస్ లో ఉంది. ఆ తర్వాత స్థానంలో మహారాష్ట్ర ఉంది. 209 యాక్టివ్ కేసులు ఆ రాష్ట్రంలో నమొదయ్యాయి. 100 కేసులతో ఢిల్లీ మూడో స్థానంలో ఉండగా.. గుజరాత్ లో 83, కర్ణాటకలో 47 కేసులు, ఉత్తరప్రదేశ్ లో 15, పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో 12 కేసులు బయటపడ్డాయి.
ఇప్పటి వరకు దేశంలో కరోనాతో నలుగురు చనిపోయారు. మహారాష్ట్రలో ఒకరు, కేరళలో ఇద్దరు,, కర్ణాటకలో ఒకరు కోవిడ్ వైరస్ ఎటాక్ అయ్యి చనిపోయారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..