విద్యుత్ కార్మికులకు కోటి ప్రమాద భీమా – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, 26 మే (హి.స.) విద్యుత్ కార్మికులకు కోటి రూపాయలకు పైబడి ప్రమాద బీమా అందించడం దేశ చరిత్రలోనే ఒక రికార్డు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సోమవారం ఉదయం ప్రజాభవన్ లో ఎన్ పి డిసిఎల్ సి పరిధిలో విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్త
డిప్యూటీ సీఎం


హైదరాబాద్, 26 మే (హి.స.)

విద్యుత్ కార్మికులకు కోటి రూపాయలకు పైబడి ప్రమాద బీమా అందించడం దేశ చరిత్రలోనే ఒక రికార్డు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సోమవారం ఉదయం ప్రజాభవన్ లో ఎన్ పి డిసిఎల్ సి పరిధిలో విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన జోగు నరేష్ కుటుంబ సభ్యులకు కోటి రూపాయల ప్రమాద బీమా చెక్కు తో పాటు విద్యుత్ శాఖలో నరేష్ సతీమణికి కారుణ్య నియామక ఉత్తర్వులు అందజేసిన సందర్భంగా డిప్యూటీ సీఎం ప్రసంగించారు. విద్యుత్ కార్మికునికి కోటి రూపాయల ప్రమాద బీమా చెక్కును అందించడం కేవలం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వంలోని సాధ్యం అయ్యింది అన్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande