నైరుతి రుతు పవనాల కారణంగా రాయలసీమలో ఓ.మోస్తరు.నుంచి.భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ.వెల్లడించింది
అమరావతి, 26 మే (హి.స.) నైరుతి రుతుపవనాల కారణంగా రాయలసీమలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఒకరోజు ముందుగానే ఇవాళ కడపలో ఓ మోస్తారుగా వర్షం కురుస్తోంది. అదేవిధంగా ఉపరితల ద్రోణి ప్రభావంతో బాపట్ల జిల్లాలోని పల
నైరుతి రుతు పవనాల కారణంగా రాయలసీమలో ఓ.మోస్తరు.నుంచి.భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ.వెల్లడించింది


అమరావతి, 26 మే (హి.స.)

నైరుతి రుతుపవనాల కారణంగా రాయలసీమలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఒకరోజు ముందుగానే ఇవాళ కడపలో ఓ మోస్తారుగా వర్షం కురుస్తోంది. అదేవిధంగా ఉపరితల ద్రోణి ప్రభావంతో బాపట్ల జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. చీరాల, వేటపాలెంలలో భారీ వర్షం కురిసింది. గంటకుపైగా కురిసిన వర్షానికి పట్టణంలోని రహదార్లు చిత్తడిగా మారాయి. భారీ శబ్దాలతో ఉరుములు, మెరుపులతో వాన పడుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande