అమరావతి, 26 మే (హి.స.)
వేసవి సెలవుల నేపథ్యంలో.. ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. దీనితో తితిదే అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. కొత్త క్యూలైన్ మేనేజ్మెంట్ను ఏర్పాటు చేశారు. అన్ని విభాగాలను సమన్వయం చేస్తూ.. భక్తులకు స్వామి వారి దర్శనంతో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ