నేటితో ముగియనున్న కాళేశ్వరం పుష్కరాలు.. భక్తజన సంద్రమైన నదీతీరం.
హైదరాబాద్, 26 మే (హి.స.) కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాలు నేటితో ముగియనున్నాయి. చివరి రోజు కావడంతో భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. దీపాలు వెలిగించి గంగమ్మకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అనంతరం కా
కాలేశ్వరం


హైదరాబాద్, 26 మే (హి.స.)

కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాలు నేటితో ముగియనున్నాయి. చివరి రోజు కావడంతో భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. దీపాలు వెలిగించి గంగమ్మకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అనంతరం కాళేశ్వర ముక్తీశ్వరుడిని దర్శించుకుంటున్నారు.కాగా సోమవారం రాత్రి 7:45 గంటలకు నవరత్నమాల హారతితో పుష్కరాలు ముగియనున్నాయి. పుష్కరాల ముగింపు సందర్భంగా వీఐపీ ఘాట్ వద్ద ఇవాళ ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. సాయంత్రి 6 గంటల నుంచి వేద స్వస్తి కార్యక్రమం, బ్రహ్మశ్రీ నాగ ఫణిశర్మ సందేశం, మంత్రుల ప్రసంగాలు ఉంటాయని అధికారులు తెలిపారు. రాత్రి 7.46 నుంచి 7.54 వరకు డ్రోన్ షో నిర్వహించనున్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande