కడప, ఏ.పీ, 26 మే (హి.స.)
వైఎస్ఆర్ కడప జిల్లాలో రేపు
జరగనున్న టీడీపీ మహానాడుకు సర్వం సిద్ధమైంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా పూర్తయ్యాయి. కడప నగరం మొత్తం పసుపు తోరణాలు, పార్టీ జెండాలు, ఫ్లెక్సీలతో నిండిపోయి, పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది. మహానాడు సభ ప్రాంగణం మొత్తం భారీ కటౌట్లతో పసుపు మయమైంది.
ఈ క్రమంలో కడపలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. దీంతో భారీ ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. కడపలో భారీగా ఈదురుగాలులకు టీడీపీ మహానాడు ప్రాంగణంలో కటౌట్లు కిందపడిపోయాయి. ఈ క్రమంలో ప్రాంగణంలో ఉన్న అట్లూరు వీఆర్వోకు కటౌట్ పడి గాయాలు అయ్యాయి.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..