తెలంగాణ, మేడ్చల్ . 26 మే (హి.స.) రోడ్డుపై విద్యుత్ తీగ తెగిపడిన ప్రమాదంతో ఓ నిండు ప్రాణం బలైన హృదయ విదారక ఘటన మేడ్చల్ జిల్లా కీసర లో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నాగారo మునిసిపాలిటీకి చెందిన సరేష్, మౌనిక దంపతులు తమ మూడేళ్ల కుమారుడు శ్రేయాస్తో కలిసి బైక్పై వెళ్తున్నారు. ఈ క్రమంలోనే భారీ ఈదురుగాలుల కారణంగా ఓ విద్యుత్ తీగ తెగి వారి బైక్ పై పడింది. ఈ దుర్ఘటనలో మౌనికతో పాటు నరేష్, శ్రేయాసకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ముగ్గురిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే, ఇవాళ ఉదయం మౌనిక చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. భర్త నరేశ్, బాబు శ్రేయాస్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు