అమరావతి, 26 మే (హి.స.)
, హైదరాబాద్: మెట్రో రైలు రెండోదశ ఆలస్యమయ్యే కొద్దీ రెండు రకాల సవాళ్లు ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రాజెక్ట్ అంచనా వ్యయం భారీగా పెరిగే అవకాశం ఉంది. కొన్ని మార్గాల్లో మెట్రో నిర్మాణమే ప్రశ్నార్థకంగా మారనుందనే ఆందోళనలను మెట్రో అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపాదిత 2(ఏ)లోని ఐదు కారిడార్ల డీపీఆర్లను కేంద్రానికి సమర్పించి 8 నెలలవుతోంది. త్వరగా అనుమతులివ్వాలని ఇటీవల సీఎం రేవంత్రెడ్డి ప్రధానిని కలిసి కోరారు. మెట్రోరైలు 2(ఏ)లో రూ.24,269 కోట్ల అంచనాతో ఐదు కారిడార్లను ప్రతిపాదించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్య ప్రాజెక్ట్గా దీన్ని చేపట్టాలని నిర్ణయించారు. కేంద్ర అనుమతుల్లో జాప్యమయ్యే కొద్దీ అంచనాలు పెరిగే అవకాశం ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ