వ‌డోద‌ర‌లో మోదీ ప‌ర్య‌ట‌న – పూలు చల్లుతూ స్వాగతం పలికిన కల్నల్‌ సోఫియా ఖురేషి కుటుంబ సభ్యులు..
గుజరాత్, 26 మే (హి.స.) ఆపరేషన్‌ సింధూర్‌ తర్వాత తొలిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్‌లో నేడు పర్యటిస్తున్నారు. గుజరాత్‌లో రెండురోజుల పర్యటనలో భాగంగా.. ప్రధాని మోదీ వడోదరలో రోడ్‌షోతో పర్యటనను ప్రారంభించారు. త్రివర్ణపతాకాలతో ప్రధానికి వడోదర ప్రజ
ప్రధాని మోదీ


గుజరాత్, 26 మే (హి.స.)

ఆపరేషన్‌ సింధూర్‌ తర్వాత తొలిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్‌లో నేడు పర్యటిస్తున్నారు. గుజరాత్‌లో రెండురోజుల పర్యటనలో భాగంగా.. ప్రధాని మోదీ వడోదరలో రోడ్‌షోతో పర్యటనను ప్రారంభించారు. త్రివర్ణపతాకాలతో ప్రధానికి వడోదర ప్రజలు ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. ప్రధాని మోదీకి నారీశక్తి స్వాగతం పలికింది.. మోదీకి 30వేల మంది మహిళలు పూలు చల్లుతూ స్వాగతం పలికారు.కాగా.. గుజరాత్‌లోని వడోదరలో ప్రధాని మోదీ పాల్గొన్న సింధూర్‌ సమ్మాన్‌యాత్రలో కల్నల్‌ సోఫియా ఖురేషీ కుటుంబం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మోదీపై కల్నల్‌ సోఫియా ఖురేషీ కుటుంబ సభ్యులు పూలవర్షం కురిపించారు.. ప్రధాని మోదీకి పూలు చల్లుతూ ఖురేషి కుటుంబసభ్యులు స్వాగతం పలకగా.. ప్రధాని మోదీ వారికి అభివాదం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande