తెలంగాణ, పెద్దపల్లి. 26 మే (హి.స.)
రామగుండం హైవే సర్వీస్ రోడ్
అభివృద్ధి పనులను రూ.25 కోట్లతో చేపడుతున్నామని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్సింగ్ తెలిపారు. సోమవారం రామగుండం హైవేలో చేపట్టిన సర్వీస్ రోడ్ విస్తరణ పనులను స్వయంగా అధికారులతో పరిశీలించి మాట్లాడారు. పనులకు సుమారు రూ. 25 కోట్లు ఖర్చు అవుతుందని, నగర రవాణా వ్యవస్థను మరింత సులభతరం చేయాలనే ఉద్దేశంతో ప్రాజెక్ట్ చేపట్టినట్లు తెలిపారు.
రోడ్స్ అండ్ బిల్డింగ్స్ శాఖ, సింగరేణి మున్సిపల్ అధికారులు, ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులతో కలిసి పనుల పురోగతిని సమీక్షించారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, అత్యుత్తమ నాణ్యతతో, నిర్దేశిత కాలపట్టికలో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు