తెలంగాణ, కామారెడ్డి. 26 మే (హి.స.)
కళాశాల ప్రారంభమవుతుందని
ట్యాంకు కడిగేందుకు సిద్దమైన కళాశాల సిబ్బంది విద్యుత్ ఘాతానికి గురవ్వగా ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు సాంఘిక సంక్షేమ ఆశ్రమ కళాశాలలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే కళాశాలలో అవుట్ సోర్సింగ్ గా పనిచేస్తున్న అటెండర్ భాస్కర్, ఎలక్ట్రిషన్ ఆరోజ్, నైట్ వాచ్ మెన్ దోమకొండ లింగంలు, కళాశాల ఆవరణలో ఉన్న ట్యాంకును కడిగేందుకు ఒకరు కింద ఉండగా, మరొకరు ట్యాంక్ లోకి దిగారు. ఇంకొకరు ట్యాంకు పైకి ఎక్కగా, భాస్కర్ అనే అటెండర్ కింది నుంచి ఇనుప నిచ్చెనను పైకి అందించాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు పైనున్న విద్యుత్ వైర్లకు నిచ్చెన తగిలి, నిచ్చెనను పట్టుకున్న అటెండర్ దోమకొండ లింగం (35), ఎలక్ట్రిషన్ ఆరోజ్ లు విద్యుదాఘాతానికి గురయ్యారు.
లింగం ఎగిరిపడి అక్కడికక్కడే మృతి చెందగా, ఆరోజ్ తలకు బలమైన గాయాలు తగిలాయి.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు