సీజన్ ప్రారంభంలోనే కష్టాలు.. రైతుల పాసుబుక్కులతో క్యూలైన్లు
తెలంగాణ, సంగారెడ్డి. 26 మే (హి.స.) వానకాలం సీజన్ ప్రారంభంలోనే రైతులకు విత్తనాల కష్టాలు మొదలయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో కనుమరుగైన పాసుబుక్కుల క్యూలైన్లు మళ్లీ ఇప్పుడు దర్శనమిస్తున్నాయి. సీజన్ ప్రారంభం కాకముందే ఇలాంటి కష్టాలు ఉంటే సీజన్ ప్రారంభమైన తర్
రైతుల పాస్ బుక్కులు


తెలంగాణ, సంగారెడ్డి. 26 మే (హి.స.)

వానకాలం సీజన్ ప్రారంభంలోనే రైతులకు విత్తనాల కష్టాలు మొదలయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో కనుమరుగైన పాసుబుక్కుల క్యూలైన్లు మళ్లీ ఇప్పుడు దర్శనమిస్తున్నాయి. సీజన్ ప్రారంభం కాకముందే ఇలాంటి కష్టాలు ఉంటే సీజన్ ప్రారంభమైన తర్వాత ఇంకెలా ఉంటుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒక పక్క వడ్లు వర్షానికి తడిసి రైస్ మిల్లర్లకు వెళ్లకముందే మొలకెత్తుతుండగా.. మరో పక్క విత్తనాల కొరతతో రైతులు పట్టా పాస్ పుస్తకాలు క్యూ లైన్లో పెట్టి బారులు తీరుతున్నారు.

సంగారెడ్డి జిల్లా జోగిపేట వ్యవసాయ కార్యాలయం ఎదుట సోమవారం ఉదయం నుండి విత్తనాల కోసం రైతులు బారులు తీరారు. విత్తనాల కొసం తమ పట్టా పాస్ బుక్లను క్యూ లైన్లో పెట్టి కార్యాలయం వద్ద గంటలకొద్ది వేచి ఉన్నారు. సోమవారం నుండి సబ్సిడీ విత్తనాలను పంపిణీ చేస్తామని.. గత రెండు రోజుల నుంచి అధికారులు ప్రకటిస్తుండడంతో సోమవారం ఉదయం నుంచి రైతులు పెద్ద సంఖ్యలో వ్యవసాయ కార్యాలయం వద్దకు చేరుకున్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande