తెలంగాణ, సిద్దిపేట. 26 మే (హి.స.)
కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజ్లకు
ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. హామీలు నెరవేర్చకుంటే యుద్ధానికి కూడా సిద్ధమని ప్రకటించారు. సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం పాలమాకులలో పండగ సాయన్న ముదిరాజ్, కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్ విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమంలో శాసన మండలి వైస్ చైర్మన్ బండ ప్రకాశ్తో కలిసి హరీశ్రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రముఖుల విగ్రహాలను పెట్టుకుని గుర్తించుకుంటున్నామని అన్నారు. మన ప్రముఖుల చరిత్రలు బయటకు వస్తున్నాయని తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు