తెలంగాణ, రంగారెడ్డి. 26 మే (హి.స.)
చత్తీస్ ఘడ్ లోని నారాయణపూర్
జిల్లా అబూజ్ మడ్ అడవుల్లో గత బుధవారం రాత్రి జరిగిన ఎన్ కౌంటర్ లో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండల పరిధిలోని వేములనర్వ గ్రామానికి చెందిన మావోయిస్టు విజయలక్ష్మి అలియాస్ భూమిక మృతి చెందింది. ఆమె మృతదేహం కోసం మృతురాలి తండ్రి వన్నాడ సాయిలు, బంధువులు చత్తీస్ ఘడ్ లోని నారాయణపూర్ జిల్లా ఆస్పత్రికి ఆదివారం మధ్యాహ్నం వెళ్లారు. అయితే ఇప్పటికీ అక్కడి అధికారులు భూమిక మృతదేహాన్ని అప్పగించేందుకు నిరాకరిస్తున్నారని, ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీకుంటామని అంటున్నారని చేస్తున్నారు. బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు