హైదరాబాద్, 26 మే (హి.స.) అతిగా మద్యం సేవించి వాంతులతో యువకుడు మృతి చెందిన విషాదకర ఘటన రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆదివారం
స్నేహితులతో కలిసి పబ్ కు వెళ్లి
అందరూ కలిసి మద్యం సేవించి సరదాగా ఆడిపాడారు. అక్కడి నుంచి తిరిగి తాము ఉంటున్న ప్లాట్ కు వచ్చి మరోసారి మద్యం తాగారు. దీంతో వాంతులు చేసుకున్న ఓ యువకుడిని ఆసుపత్రికి తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి విజయనగరం జిల్లా ప్రసాద్ నగర్ కి చెందిన హర్షవర్ధన్(26) గా గుర్తించారు. ఇతడు సికింద్రాబాద్ లోని ఓ ఏసీ కంపెనీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్నాడు.
సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..