వైకాపా హయాం లో ఓ బాలుడికి తల్లి.తండ్రులున్న విడిగా రేషన్ కార్డును .మంజూరు చేశారు
అమరావతి, 26 మే (హి.స.) , : కొత్త రేషన్‌ కార్డు మంజూరుకు అన్ని అర్హతలు, ధ్రువపత్రాలు చూస్తున్న అధికారులు.. వైకాపా హయాంలో మాత్రం ఓ బాలుడికి తల్లిదండ్రులున్నా నిబంధనలకు విరుద్ధంగా విడిగా రేషన్‌ కార్డు మంజూరు చేశారు. ఫలితంగా ప్రభుత్వ పథకాలు లబ్ధిపొందడంల
వైకాపా హయాం లో ఓ బాలుడికి తల్లి.తండ్రులున్న విడిగా రేషన్ కార్డును .మంజూరు చేశారు


అమరావతి, 26 మే (హి.స.)

, : కొత్త రేషన్‌ కార్డు మంజూరుకు అన్ని అర్హతలు, ధ్రువపత్రాలు చూస్తున్న అధికారులు.. వైకాపా హయాంలో మాత్రం ఓ బాలుడికి తల్లిదండ్రులున్నా నిబంధనలకు విరుద్ధంగా విడిగా రేషన్‌ కార్డు మంజూరు చేశారు. ఫలితంగా ప్రభుత్వ పథకాలు లబ్ధిపొందడంలో ఇబ్బందులు వస్తున్నాయని బాలుడి తండ్రి వాపోతున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణానికి చెందిన పిన్నపోతుల గోపి, సురేఖ దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు కాగా.. పెద్ద కుమారుడితో కలిసి ముగ్గురికి ఒక రేషన్‌ కార్డు ఉంది. ఇందులో చిన్న కుమారుడు లోకేశ్‌(11) పేరులేదు. ప్రస్తుతం ఇతడు 5వ తరగతి పూర్తిచేశాడు. 6వ తరగతిలో చేరనున్నాడు. కుటుంబసభ్యులు రేషన్‌కార్డుకు దరఖాస్తు చేయకున్నా.. వైకాపా పాలనలో ఈ బాలుడి పేరుతో 2020 ఫిబ్రవరిలో విడిగా ఓ కార్డు మంజూరైంది. దాన్ని సచివాలయ సిబ్బంది ఇంటికి వచ్చి ఇవ్వడంతో కుటుంబసభ్యులు ఆశ్చర్యపోయారు. అనంతరం దాన్ని రద్దు చేయాలని ఆ విద్యార్థి తండ్రి సచివాలయంలో వినతి ఇచ్చారు. విచారణ చేపట్టి సమస్య పరిష్కరిస్తామని అప్పట్లో పౌరసరఫరాల శాఖ అధికారులు చెప్పినా, నేటికీ రద్దు కాలేదని ఆయన తెలిపారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి తాము ప్రభుత్వ పథకాలు నష్టపోకుండా ఉండేందుకు కార్డు రద్దు చేయాలని బాలుడి తండ్రి కోరుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande