శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తుల తాకిడి..
నంద్యాల, ఏ.పీ, 26 మే (హి.స.) నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం ముక్కంటి మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు కావడం పైగా సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైన రోజు కావడంతో స్వామి అమ్మవార్లకు దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో
శ్రీశైలం మల్లన్న


నంద్యాల, ఏ.పీ, 26 మే (హి.స.)

నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం

శ్రీశైలం ముక్కంటి మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు కావడం పైగా సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైన రోజు కావడంతో స్వామి అమ్మవార్లకు దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. శ్రీశైలం క్షేత్రమంత భక్తజనంతో సందడి వాతావరణం నెలకొంది. భక్తులు వేకువజామున నుండే పాతాళగంగలో పుణ్య స్నానాలు ఆచరించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూలైన్ లో దర్శనం కంపార్టుమెంట్లలో బారులు తీరారు. శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 3 గంటల సమయం పడుతుంది.

మరోపక్క భక్తులు రద్దీ దృష్ట్యా శని, ఆది, సోమవారంలో ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చన నిలుపుదల చేశారు. సామాన్య భక్తులకు ఉచిత దర్శనం, శీఘ్ర దర్శనానికి భారీగా పెరిగిన భక్తులు రద్దీగా ఎక్కువగా ఉండటంతో మూడు విడతలుగా మాత్రమే(BREAK) స్పర్శ దర్శనానికి అనుమతిస్తున్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande