అమరావతి, 27 మే (హి.స.)
చిత్తూరు (జిల్లా ), ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో దళితులు అభివృద్ధి చెందాలని రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ ఛైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి అన్నారు. ఆమె కలెక్టరేట్లోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైకాపా హయాంలో దళితులను అణగదొక్కేశారని, జగన్ పాలనలో రాష్ట్రంలో 200 మంది దళితులు హత్యకు గురయ్యారన్నారు. గతంలో తెదేపా ప్రభుత్వం అమలు చేసిన విదేశీ విద్య, బాస్, భూ కొనుగోలు పథకాలను వైకాపా రద్దు చేసిందన్నారు. నా ఎస్సీలు అని చెప్పుకొనే జగన్, దళిత డ్రైవరును హత్య చేసి డోర్ డెలివరీ చేసిన నాటి ఎమ్మెల్సీ అనంతబాబును అక్కున చేర్చుకోవడం దళితులపై ఆయనకున్న చిత్తశుద్ధిని తెలియజేస్తోందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ