అమరావతి, 27 మే (హి.స.):తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ దాడి కేసులో ఆయన పేరును 127వ ముద్దాయిగా సీఐడీ పోలీసులు చేర్చారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అంటే.. 2021, అక్టోబర్ 19వ తేదీన మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై వైసీపీ అరాచక మూకలు దాడికి తెగబడ్డాయి. అయితే కూటమి ప్రభుత్వం కొలువు తీరిన అనంతరం ఈ దాడి కేసును సీఐడీకి అప్పగించింది.
అయితే ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, నాటి బాపట్ల ఎంపీ నందిగం సురేష్, విజయవాడ తూర్పు వైసీపీ ఇన్చార్జి దేవినేని అవినాశ్ ఆధ్వర్యంలోని వైసీపీ ముఖ్యనేతల ఆదేశాలతో ఈ దాడికి పథక రచన జరిగినట్లు సమాచారం. వందలాది మంది వైసీపీ నాయకులతో పాటు రౌడీషీటర్లు, పలువురు మహిళలు ఈ దాడిలో పాల్గొన్నారు. టీడీపీ కార్యాలయం ప్రధాన గేటును కూల్చి లోపలకి ప్రవేశించిన అల్లరి మూకలు కార్యాలయ సిబ్బందిపై విచక్షణారహితంగా దాడి చేసి
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ