హైదరాబాద్, 27 మే (హి.స.)
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు
ప్రతిష్ఠాత్మకమైన కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని కేటాయించినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంగళవారం ద్వారా ప్రకటించారు.
కిషన్ రెడ్డి తన ట్వీట్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణకు మరొక కీలక కేంద్ర పరిశోధన సంస్థను మంజూరు చేశారు. రూ.265 కోట్ల వ్యయంతో రైల్వే భద్రత కోసం కవచ్ కేంద్రాన్ని సికింద్రాబాద్లో ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపారని రాసుకొచ్చారు. దేశ రైల్వే భద్రత విషయంలో ప్రపంచ స్థాయి సాంకేతికతను అభివృద్ధి చేయడం, 5G పరీక్ష, నైపుణ్య అభివృద్ధి, స్మార్ట్ రైలు వ్యవస్థలను రూపొందించడం ఈ కవచ్ కేంద్రం ముఖ్య ఉద్దేశాలు. దీని ద్వారా సురక్షితమైన రైల్వే రవాణాకు మార్గం సుగమం కానుంది. మేక్ ఇన్ ఇండియా కింద సురక్షితమైన, ఆత్మనిర్భర రైల్వే నెట్వర్క్ సాధన కోసం ఇదొక గొప్ప ముందడుగు అని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్