మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరపాలి.. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్, 27 మే (హి.స.) ఆపరేషన్ కగార్ వెంటనే ఆపివేయాలని, మావోయిస్టులతో చర్చలు జరపాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కేంద్రాన్ని డిమాండ్ చేశారు.తెలంగాణ భవన్లో నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని ప్రభుత్వాలు వెనకటి నుండి కార్పోరేట్ల తరపున
నిరంజన్ రెడ్డి


హైదరాబాద్, 27 మే (హి.స.) ఆపరేషన్ కగార్ వెంటనే ఆపివేయాలని, మావోయిస్టులతో చర్చలు జరపాలని మాజీ మంత్రి

నిరంజన్ రెడ్డి కేంద్రాన్ని డిమాండ్ చేశారు.తెలంగాణ భవన్లో నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని ప్రభుత్వాలు వెనకటి నుండి కార్పోరేట్ల తరపున తప్ప సామాన్యుల తరపున ఆలోచన చేయడం లేదని ధ్వజమెత్తారు. తమకు తోచిందే అమలు చేస్తాం అధికారం ఉంది కాబట్టి ఇష్టారాజ్యంగా పోతాం అన్నట్లు కేంద్రం వ్యవహరిస్తున్నది తప్పితే ప్రస్తుత తరం తరపున ఆలోచన చేయడం లేదు అని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande