ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో దోషి గాలి జనార్దన్ రెడ్డిని బెంగళూరుకు తరలించిన పోలీసులు
హైదరాబాద్, 27 మే (హి.స.) ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో దోషి గాలి జనార్దన్ రెడ్డిని పోలీసులు బెంగళూరుకు తరలించారు. ఈ కేసులో ఆయన ప్రస్తుతం చంచల్ గూడ జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. గాలి జనార్ధన్ రెడ్డిపై బెంగళూరులో పలు కేసులు నమోదు అయ్య
గాలి జనార్దన్ రెడ్డి


హైదరాబాద్, 27 మే (హి.స.)

ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో దోషి గాలి జనార్దన్ రెడ్డిని

పోలీసులు బెంగళూరుకు తరలించారు. ఈ కేసులో ఆయన ప్రస్తుతం చంచల్ గూడ జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. గాలి జనార్ధన్ రెడ్డిపై బెంగళూరులో పలు కేసులు నమోదు అయ్యారు. ఈ కేసుల విచారణ నిమిత్తం తాజాగా ఆయనను పీటీ వారెంట్ పై బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలుకు తరలించారు. కాగా ఓఎంసీ కేసులో గాలి జనార్ధన్ రెడ్డితో పలువురికి నాంపల్లి సీబీఐ కోర్టు ఏడేళ్లు జైలు శిక్ష విధించింది. దీంతో దోషులందరిని అధికారులు జైలుకు తరలించారు. సీబీఐ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ గాలి జనార్ధన్ రెడ్డి సహా నలుగురు తెలంగాణ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వీరికి బెయిల్ ఇవ్వొద్దంటూ సీబీఐ నిన్న కౌంటర్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande