అమరావతి, 27 మే (హి.స.)
:అమెరికాలోని బే ఏరియాలో వెండితెర ఇలవేల్పు, నట సార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 102వ జయంతి పురస్కరించుకుని ఎన్నారై టీడీపీ కోఆర్డినేటర్ జయరాం కోమటి, వెంకట్ కోగంటి ఆధ్వర్యంలో మినీ మహానాడు సంబరాలను ఘనంగా నిర్వహించారు. మిల్పిటాస్ నగరంలోని స్టార్ లైట్ పార్క్ వేదికగా జరిగిన మినీ పసుపు పండుగకు పలువురు ఎన్నారైలు హాజరై సందడి చేశారు.
2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత జరుగుతున్న మొదటి మహానాడు కావడంతో తెలుగు తమ్ముళ్లు ఈ సారి మహానాడు కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అలాగే కాలిఫోర్నియాలోని తెలుగుదేశం పార్టీ ఎన్నారైలు కూడా మినీ మహానాడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని మహానాయకుడు, కథానాయకుడు ఎన్టీఆర్ 102వ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 150 మందికి పైగా తెలుగుదేశం పార్టీ అభిమానులు, మహిళలు, చిన్నారులు ఉప్పొంగిన ఉత్సాహంతో పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ