హైదరాబాద్, 27 మే (హి.స.) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లండన్,అమెరికా పర్యటన కోసం హైదరాబాద్ నుంచి బయలుదేరారు. ఈ పర్యటనలో ఆయన అమెరికాలో జరగనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు. ముఖ్యంగా జూన్ 1న డల్లాస్లో నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారు. దీనికోసం అక్కడి బీఆర్ఎస్ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
లండన్ పర్యటనలో భాగంగా 'ఇండియా వీక్ 2025లో కేటీఆర్ ప్రధాన ఉపన్యాసం ఇవ్వనున్నారు. అంతేకాకుండా, మే 30న ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆటోమోటివ్ బ్రాండ్లు.. మెక్లారెన్, ఆస్టన్ మార్టిన్, జాగ్వార్ ల్యాండ్ రోవర్ లకు ఆర్ & డి సేవలు అందించే పీడీఎస్ఎల్ నాలెడ్జ్ సెంటర్ను ఆయన ప్రారంభించనున్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్