కర్నూలు 27 మే (హి.స.)కర్నూలు వైద్యాలయం, కర్నూలు సర్వజన ఆస్పత్రిలో ఇద్దరికి అరుదైన శస్త్రచికిత్సలు చేసి ప్రాణాలు కాపాడినట్లు జనరల్ సర్జరీ విభాగం వైద్యులు డా.రామకృష్ణనాయక్ తెలిపారు. ఆస్పత్రి పర్యవేక్షకుడు డా.వెంకటేశ్వర్లు, జనరల్ సర్జరీ విభాగాధిపతి డా.హరిచరణ్, డా.జయరాం, డా.సబీనా, ఆపరేషన్లు చేయించుకున్న పర్వీన్ (29), ఎలీషారాణి (15)తో కలిసి సోమవారం వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా డా.రామకృష్ణనాయక్ మాట్లాడుతూ పాములపాడు మండలం ఆనందాపురం గ్రామానికి చెందిన ఎలీషారాణి ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరారని చెప్పారు. వైద్య పరీక్షలు చేయగా హిమోగ్లోబిన్ చాలా తక్కువగా ఉండటంతోపాటు ప్లేట్లెట్లు 60 వేల మాత్రమే ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. వివిధ పరీక్షలు చేయగా అన్నవాహికకు సంబంధించి వేరిసెస్తో కూడిన పోర్టల్ హైపర్ టెన్షన్గా నిర్ధారణ అయిందని చెప్పారు. వైద్యులు జయరాం, సబీరా, మన్సురాబాషా, ప్రణీత్, సుధీర్, మురళీ ప్రభాకర్తో కలిసి శస్త్రచికిత్స చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం ప్లేట్లెట్ కౌంట్ 5 లక్షల వరకు పెరిగిందని వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ